టిక్కెట్ల రద్దు చార్జీలతో రైల్వేకు తొమ్మిదివేల కోట్ల ఆదాయం

రైల్వే టిక్కెట్ల రద్దు, వెయిటింగ్‌ లిస్ట్‌లోని టిక్కెట్లను ప్రయాణికులు రద్దు చేసుకోకపోవడం వల్ల 2017-20లో రైల్వేకు రూ.9000 కోట్ల ఆదాయం వచ్చింది. రాజస్థాన్‌లోని కోట ఆర్టీఐ కార్యకర్త సుజిత్‌ స్వామి దరఖాస్తుపై ‘ది సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌' సమాధానమిచ్చింది. 2017 జనవరి 1 నుంచి 2020 జనవరి 31 వరకు 9.5 కోట్ల మంది ప్రయాణికులు వెయిటింగ్‌ లిస్ట్‌లోని తమ టిక్కెట్లను రద్దు చేసుకోనందున రూ.4,335 కోట్ల ఆదాయం, టిక్కెట్ల రద్దు కోసం చెల్లించిన ఫీజు వల్ల రూ.4,684 కోట్లకి పైగా ఆదాయం వచ్చిందని తెలిపింది.